PAVITROTSAVAMS IN RISHIKESH TEMPLE_ సెప్టెంబరు 2 నుంచి 5వ తేదీ వరకు

Tirupati, 24 August 2017: The annual pavitrotsavams will be observed in Sri Chandramouleeswara Swamy temple located at Andrashramam in Rishikesh from September 3-5with Ankurarpanam on September 2.

On first day there will be Pavitra Pratista, second day Pavitra Samarpana and on final day Pavitra Purnahuti will be observed.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

సెప్టెంబరు 2 నుంచి 5వ తేదీ వరకు

రిషికేశ్‌లోని శ్రీ చంద్రమౌళీశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు

ఆగస్టు 24, తిరుపతి, 2017: టిటిడి పరిధిలోని రిషికేష్‌ ఆంధ్ర ఆశ్రమంలో గల శ్రీ చంద్రమౌళీశ్వరస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 2 నుంచి 5వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి.

ఆలయంలో సంవత్సరం పొడవునా జరిగిన పలు క్రతువుల్లో తెలిసీ తెలియక జరిగిన దోషాల నివారణకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాల వల్ల ఒక సంవత్సరంపాటు యజ్ఞం చేసినంత ఫలితం కలుగుతుందని అర్చకులు చెబుతున్నారు.

సెప్టెంబరు 2న అంకురార్పణంతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. సెప్టెంబరు 3న ఉదయం స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సెప్టెంబరు 4న పరివారదేవతలకు గ్రంధి పవిత్ర సమర్పణ చేపడతారు. సెప్టెంబరు 5న పరివారదేవతలకు, మూలమూర్తులకు పవిత్రాల సమర్పణ, మహాపూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహిస్తారు. రూ.500/- చెల్లించి గ హస్తులు(ఇద్దరు) ఈ పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.