POURNAMI GARUDA SEVA HELD _ తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ
Tirumala, 28 Jan. 21: The monthly Pournami Garuda Seva was held on a pleasant evening on Thursday at Tirumala between 7pm and 9pm.
The processional deity of Sri Malayappa Swamy took a celestial ride on Garuda Vahanam in all His splendour along the four Mada streets surrounding Tirumala temple, blessing devotees.
Addl EO Sri AV Dharma Reddy, Peishkar Sri Jaganmohanacharyulu, Parpathyedar Sri Gurrappa and others took part.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ
తిరుమల, 2021 జనవరి 28: తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు ధగాధగా మెరిసిపోతున్న గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
గరుడ వాహనం – సర్వపాప ప్రాయశ్చిత్తం
పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్స్వామి, అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, పేష్కార్ శ్రీ జగన్మోహనాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.