PULSE POLIO FOR TTD DEVOTEES AT TIRUMALA_ జనవరి 28 నుండి 30వ తేదీ వరకు పల్స్‌పోలియో

Tirumala, 25 January 2018: Tirumala Tirupati Devasthanams has rolled out pulse polio program for benefit of five year old among devotees and locals at Tirumala from January 28-30.

The pulse polio camps were organised one at Sri Vari Temple. 20 different locations at Tirumala for devotees , four for locals, totalling to 25 with a staff of 200.

TTD Chief Medical Officer Dr Nageswara Rao said TTD was conducting pulse polio camps for last 22 years.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

జనవరి 28 నుండి 30వ తేదీ వరకు పల్స్‌పోలియో

తిరుమల, 2018 జనవరి 25: శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులు, స్థానికుల సౌకర్యార్థం టిటిడి ఆధ్వర్యంలో తిరుమలలో జనవరి 28 నుంచి 30వ తేదీ వరకు మూడు రోజుల పాటు పల్స్‌పోలియో కార్యక్రమం జరుగనుంది.

ప్రతిరోజూ ఉదయం 7.00 నుండి సాయంత్రం 6.00 గంటల వరకు శిబిరాల్లో పోలియో చుక్కలు వేస్తారు. ఇందుకోసం టిటిడి వైద్య విభాగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తిరుమలలో శ్రీవారి ఆలయంలో 1, భక్తుల కోసం వివిధ ప్రాంతాల్లో 20, స్థానికుల కోసం 4 కలిపి మొత్తం 25 శిబిరాలను ఏర్పాటుచేశారు. ఇందుకోసం వైద్యసిబ్బంది, ఎన్‌సిసి క్యాడెట్లు, ఇతర సిబ్బందికి కలిపి 200 మంది సేవలందిస్తారు. గత 22 సంవత్సరాలుగా టిటిడిలో పల్స్‌పోలియో నిర్వహిస్తున్నామని టిటిడి ముఖ్య వైద్యాధికారి డా|| నాగేశ్వరరావు తెలిపారు. ఐదేళ్ల లోపు చిన్నారులకు తప్పక పోలియో చుక్కలు వేయించాలని కోరారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.