R – DAY IN TIRUMALA ON JANUARY 26 _ గణతంత్ర వేడుకలకు గోకులం ముస్తాబు

TIRUMALA, 24 JANUARY 2024: In connection with the Republic Day celebrations, the National Flag hoisting ceremony will take place in Tirumala at Gokulam Rest House at 7am.

 

The TTD EO Sri Dharma Reddy will take part in the National Day feat and address on the occasion.

 
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
గణతంత్ర వేడుకలకు గోకులం ముస్తాబు
 
తిరుమల, 24 జ‌న‌వ‌రి, 2024: తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనం జనవరి 26న గణతంత్ర వేడుకలకు ముస్తాబైంది. తిరుమలలోని అదనపు ఈవో క్యాంపు కార్యాలయమైన ఈ భవనం ప్రాంగణంలో గణతంత్ర, స్వాతంత్ర్య దినోత్సవాలను టీటీడీ నిర్వహిస్తోంది.
 
ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం 7 గంటలకు జాతీయ జెండాను ఎగురవేస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి పాల్గొని తమ సందేశాన్ని ఇస్తారు. ఈ కార్యక్రమంలో తిరుమలలో విధులు నిర్వహించే వివిధ విభాగాధిపతులు, సిబ్బంది పాల్గొంటారు.
 
టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.