SKVST PAVITROTSAVAMS COMMENCES _ శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు ప్రారంభం

Srinivasa Mangapuram, 31 Oct. 21: The annual three day Pavitrotsavams in the temple of Sri Kalyana Venkateswara Swamy at Srinivasa Mangapuram commenced on Sunday in ekantham in view of COVID-19 guidelines.

 

On the first day Pavitra Mala Pratistha ceremony was performed. 

 

Earlier during the day Snapana Tirumanjanam was performed to Utsava Murthies. 

 

Deputy EO Smt Shanti, Superintendent Sri Chengalrayalu and priests participated in this fete which was observed in Ekantam. 

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు ప్రారంభం

తిరుపతి, 2021 అక్టోబ‌రు 31: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. కోవిడ్‌-19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా ఈ ఉత్స‌వాలు నిర్వ‌హిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివార్ల‌ను యాగశాలకు వేంచేపు చేసి వైదిక కార్యక్రమాల్లో భాగంగా పుణ్యాహవచనం, పంచగన్యారాధన, రక్షాబంధనం, అన్నప్రానాయానం నిర్వహించారు. ఆ త‌రువాత స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, ప‌సుపు, చందనంల‌తో అభిషేకం చేశారు.

అనంత‌రం సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు ఆస్థానం జ‌రిగింది. సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల వరకు యాగశాల వైదిక కార్యక్రమాలు నిర్వహించి పవిత్ర ప్రతిష్ఠ నిర్వ‌హించ‌నున్నారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి శాంతి, ఏఈవో శ్రీ ధనంజయులు, సూప‌రింటెండెంట్ శ్రీ చెంగ‌ల్రాయులు, ఆల‌య అర్చకులు శ్రీ బాలాజి రంగాచార్యులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.