SNAPANA TIRUMANJANAM HELD _ వైభవంగా శ్రీ‌వారికి స్నపనతిరుమంజనం

POURNAMI GARUDA SEVA CANCELLED ON APRIL 23

Tirumala, 22 April 2024: On the second evening on Monday, as part of the annual Vasantotsavams in Tirumala, Sri Malayappa Swamy and Consorts were rendered Snapana Tirumanjanam between 2 pm and 4 pm.

In this program Tirumala Sri Sri Pedda Jeeyar Swamy, Sri Sri Chinna Jeeyar Swamy, EO Sri. AV. Dharma Reddy couple, Temple Deputy EO Sri Lokanatham and other officers participated.

Cancellation of Purnami Garudaseva on April 23

TTD has canceled the Purnami Garudaseva on April 23 at Tirumala in connection with Vasanthotsavam.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

వైభవంగా శ్రీ‌వారికి స్నపనతిరుమంజనం

– ఏప్రిల్ 23న పౌర్ణ‌మి గరుడసేవ రద్దు

తిరుమల, 2024 ఏప్రిల్ 22: తిరుమలలోని వసంతోత్సవ మండపంలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలలో భాగంగా రెండ‌వ రోజైన సోమ‌వారం శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం వైభ‌వంగా జ‌రిగింది.

ఇందులో భాగంగా మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. ఆ తరువాత స్వామి, అమ్మవార్లు సాయంత్రం అక్కడినుండి బయల్దేరి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు.

ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఈవో
శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు, ఆలయ డెప్యూటీ ఈవో
శ్రీ లోక‌నాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఏప్రిల్ 23న పౌర్ణ‌మి గరుడసేవ రద్దు :

శ్రీవారి ఆల‌యంలో ఏప్రిల్ 23వ తేదీన‌ పౌర్ణమి గరుడసేవను టీటీడీ రద్దు చేసింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే.

శ్రీ‌వారి వార్షిక వ‌సంతోత్స‌వాలు జ‌రుగుతున్న కార‌ణంగా పౌర్ణ‌మి గరుడసేవ ర‌ద్ద‌యింది. ఈ విషయాన్ని భక్తులు గమనించగలరు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.