SRI GT JYESTABHISHEKAAM POSTER RELEASED_ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ జ్యేష్ఠాభిషేకం గోడపత్రికల ఆవిష్కరణ

Tirupati, 18 July 2018: The posters of annual Jyestabhishekaam in Sri Govinda Raja Swamy temple was released on Wednesday evening.

Tirupati JEO Sri P Bhaskar released the posters in his chambers in TTD administrative building.

This three day event will be observed from July 22 to 24 with Ankurarpanam on July 21.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ జ్యేష్ఠాభిషేకం గోడపత్రికల ఆవిష్కరణ

తిరుపతి, 2018 జూలై 18తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూలై 22 నుండి 24వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరుగనున్న జ్యేష్ఠాభిషేకం(అభిధ్యేక అభిషేకం) గోడపత్రికలను బుధవారం సాయంత్రం టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ ఆవిష్కరించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల జెఈవో కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ స్వామివారి స్వర్ణ కవచాలకు జూలై 22న కవచ అధివశం, జూలై 23న కవచ ప్రతిష్ఠ, జూలై 24న కవచ సమర్పణ జరుగనుందని తెలిపారు. ఈ ఉత్సవం సందర్భంగా మూడు రోజుల పాటు ఉదయం మహాశాంతి హోమం, పుణ్యాహవచనం, స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం, సాయంత్రం తిరువీధి ఉత్సవం జరుగుతాయన్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.