పశ్చిమగోదావరి జిల్లాలో శ్రీనివాస కల్యాణాల తేదీల్లో మార్పు

పశ్చిమగోదావరి జిల్లాలో శ్రీనివాస కల్యాణాల తేదీల్లో మార్పు

తిరుపతి, 2017 నవంబరు 29: టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో డిసెంబరు 3 నుండి 8వ తేదీ వరకు పశ్చిమగోదావరి జిల్లాలో 6 ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు జరుగనున్నాయి. మొదట డిసెంబరు 9 నుంచి 13వ తేదీ వరకు ఈ కల్యాణాలు జరగాలని నిర్ణయించారు. అయితే, పాలనాపరమైన కారణాల మూలంగా కాస్త ముందుగా కల్యాణాలు నిర్వహించనున్నారు.

– డిసెంబరు 3వ తేదీ ఆదివారం టి.నరసాపురం మండలం, నాయకులగూడెం గ్రామంలో శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తారు.

– డిసెంబరు 4వ తేది సోమవారం కామవరపుకోటలో స్వామివారి కల్యాణం జరుగనుంది.

– డిసెంబరు 5వ తేది మంగళవారం చింతలపూడి మండలం, వేంకటాపురం గ్రామంలోని మండల పరిషత్‌ పాఠశాల మైదానంలో శ్రీవారి కల్యాణం నిర్వహిస్తారు.

– డిసెంబరు 6వ తేది బుధవారం దేవరపల్లిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల మైదానంలో సాయంత్రం 6.00 గంటలకు శ్రీనివాస కల్యాణం జరుగనుంది.

– డిసెంబరు 7వ తేది గురువారం గోపాలపురం మండలం, దొండపూడి గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల మైదానంలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు.

– డిసెంబరు 8వ తేది శుక్రవారం నరసాపురంలోని టిటిడి కల్యాణమండపంలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది.

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీవేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడంలో భాగంగా రాఫ్ట్రంలోనే గాక దేశవిదేశాలలో శ్రీనివాస కళ్యాణాలు నిర్వహిస్తుంది. సుదూర ప్రాంతాల నుండి వ్యయప్రయాసలకోర్చి తిరుమలలో శ్రీవారి కల్యాణాలు వీక్షించలేని భక్తులకు ఈ కల్యాణాలు కనువిందు కానున్నాయి. శ్రీవారి కల్యాణోత్సవాల సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంకీర్తన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.