SRINIVASA KALYANAM IN 17 PLACES IN APRIL_ ఏప్రిల్‌లో 17 ప్రాంతాలలో శ్రీనివాస కల్యాణం

Tirupati, 11 April 2018: Srinivasa Kalyanam will be performed in 17 places in the month of April by Kalyanotsavam Project of TTD.

On April 13 in Visakhapatnam, April 13-17 in Nellore, Kadapa from April 19-21, on April 22 in Kurnool, April 25-30 in Chittoor districts of Andhra Pradesh.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATHI

ఏప్రిల్‌లో 17 ప్రాంతాలలో శ్రీనివాస కల్యాణం

తిరుపతి, 2018 ఏప్రిల్‌ 11: టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో విశాఖపట్నం, నెల్లూరు, కడప, కర్నూల్‌, ప్రకాశం, చిత్తూరు జిల్లాలో మొత్తం 16 ప్రాంతాలలో శ్రీనివాస కల్యాణాలు వైభవంగా నిర్వహించనున్నారు.

విశాఖపట్నం జిల్లాలో ……

– ఏప్రిల్‌ 13వ తేదీ విశాఖపట్నంలోని కాకతీయ కల్చరల్‌ అసోసియెషన్‌ ప్రాంగణంలో ఉదయం 10.00 గంటలకు శ్రీనివాస కల్యాణం జరుగనుంది.

నెల్లూరు జిల్లాలో ……

– ఏప్రిల్‌ 13వ తేదీ ఉదయగిరి మండలంలోని తిరుణమల్లపురం ఎస్‌సి కాలనీలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది.

– ఏప్రిల్‌ 14వ తేదీ కనిగిరి మండలంలోని పెద్దకొండురు ఎస్‌సి కాలనీలో శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు.

– ఏప్రిల్‌ 15వ తేదీ బుచ్చిరెడ్డిపాల్యెం మండలంలోని ఇసుకపాల్యెం ఎస్‌సి కాలనీలో స్వామివారి కల్యాణం జరుగనుంది.

– ఏప్రిల్‌ 16వ తేదీ దగధర్తి మండలంలోని తడకలూరు ఎస్‌సి కాలనీలో శ్రీనివాస కల్యాణం నిర్వహించనున్నారు.

– ఏప్రిల్‌ 17వ తేదీ బోగోలు మండలంలోని తెల్లగుంట ఎస్‌సి కాలనీలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు.

కడప జిల్లాలో ……

– ఏప్రిల్‌ 19వ తేదీ ఓబులవారిపల్లి మండలంలోని జివిపురం ఎస్‌సి కాలనీలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది.

– ఏప్రిల్‌ 20వ తేదీ మైదుకురు మండలంలోని బసవపురం ఎస్‌సి కాలనీలో శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు.

– ఏప్రిల్‌ 21వ తేదీ బి.మఠం మండలంలోని సోమిరెడ్డిపల్లిలోని ఎపి రెసిడెన్సియల్‌ స్కూల్‌లో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు.

ప్రకాశం జిల్లాలో ……

– ఏప్రిల్‌ 22వ తేదీ కంభం మండలంలోని కాకర్ల గ్రామంలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది.

కర్నూల్‌ జిల్లాలో ……

– ఏప్రిల్‌ 23వ తేదీ కొలిమిగుండ్ల మండలంలోని పెట్నికోటగ్రామంలో శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు.

చిత్తూరు జిల్లాలో ……

– ఏప్రిల్‌ 25వ తేదీ మొలకలచెరువు మండలంలోని కొత్తఇండ్లు ఎస్‌సి కాలనీలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది.

– ఏప్రిల్‌ 26వ తేదీ పిటిఎమ్‌ మండలంలోని కందుకూరు ఎస్‌సి కాలనీలో శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు.

– ఏప్రిల్‌ 27వ తేదీ కురబలకోట మండలంలోని తెట్టు ఎస్‌సి కాలనీలో స్వామివారి కల్యాణం నిర్వహించనున్నారు.

– ఏప్రిల్‌ 28వ తేదీ బి.కొత్తకోట మండలంలోని బుడాలవారిపల్లి ఎస్‌సి కాలనీలో శ్రీనివాస కల్యాణం నిర్వహించనున్నారు.

– ఏప్రిల్‌ 29వ తేదీ పెద్దమండ్యం మండలంలోని రెడ్డివారిపల్లి ఎస్‌సి కాలనీలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు.

– ఏప్రిల్‌ 30వ తేదీ గుర్రంకొండ మండలంలోని చెర్లోపల్లి ఎస్‌సి కాలనీలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు.

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడంలో భాగంగా టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో దేశ విదేశాలలో శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తున్న విషయం విదితమే.

శ్రీవారి కల్యాణోత్సవం సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.