SRINIVASA KALYANAMS FRO JULY 20_ జూలై 20 నుంచి ఐదు ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు

Tirupati, 19 July 2017: A series of divine kalyanams will be performed under the aegis of Kalyanotsavam Project of TTD from July 20 on wards.

On July 20 in Cheemakurti ZPHS in Prakasam, on 21 in Chunduru ZPHS and on 22 at Pedanandipadu ZPHS in Guntur, 23 at Pamarru ZPHS and on 24 in Kambhampadu ZPHS in Krishna district these kalyanams will be performed.

The project special officer Sri Prabhakar Rao is supervising the arrangements.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

జూలై 20 నుంచి ఐదు ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు

తిరుపతి, 2017, జూలై 19: టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో జూలై 20 నుంచి 24వ తేదీ వరకు ఐదు ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు జరుగనున్నాయి.

– జూలై 20వ తేదీన ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది.

– జూలై 21న గుంటూరు జిల్లా చుండూరు మండల కేంద్రంలోని శివాలయం ప్రాంగణంలో శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు.

– జూలై 22న గుంటూరు జిల్లా పెదనందిపాడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు.

– జూలై 23న కృష్ణా జిల్లా పామర్రు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది.

– జూలై 24న కృష్ణా జిల్లా తిరువుర్రు మండలం కంభంపాడు గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు.

శ్రీవారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసేందుకు టిటిడి రాష్ట్రంలోనే గాక, దేశవిదేశాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తోంది. సుదూర ప్రాంతాల నుండి వ్యయప్రయాసలకోర్చి తిరుమలలో శ్రీవారి కల్యాణం వీక్షించలేని భక్తులకు ఈ కల్యాణోత్సవాలు కనువిందు కానున్నాయి. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.