SRINIVASA KALYANAM IN TN ON JULY 14_ జూలై 14న తమిళనాడులోని రాశిపురంలో శ్రీనివాస కల్యాణం

Tirupati, 11 July 2018: Srinivasa Kalyanam will be observed in Rasipuram of Namakkal district on July 14.

The religious event will be performed in Sri Vidya Mandir Metric Higher Secondary school on Saturday evening between 6pm and 8pm.

TTD Kalyanotsavam Project Special Officer Sri Prabhakar Rao is supervising the arrangements.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

జూలై 14న తమిళనాడులోని రాశిపురంలో శ్రీనివాస కల్యాణం

తిరుపతి, 2018 జూలై 11: టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో జూలై 14వ తేదీన తమిళనాడులోని రాశిపురంలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది.

నామక్కల్‌ జిల్లా రాశిపురంలోని శ్రీ విద్యామందిర్‌ మెట్రిక్‌ హయ్యర్‌ సెకండరీ పాఠశాలలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు. సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు భక్తి సంకీర్తనలు ఆలపిస్తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు కల్యాణోత్సవం నిర్వహిస్తారు.

శ్రీవేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడంలో భాగంగా టిటిడి పలు ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తోంది. సుదూర ప్రాంతాల నుండి వ్యయప్రయాసలకోర్చి తిరుమలలో శ్రీవారి కల్యాణాలు వీక్షించలేని భక్తులకు ఈ కల్యాణాలు కనువిందు కానున్నాయి. శ్రీవారి కల్యాణోత్సవాల సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంకీర్తన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.