THIRD EDITION OF AYODHYA KANDA AKHANDA PARAYANAM HELD _ భక్తిభావాన్ని పంచిన అయోధ్యా కాండ‌ అఖండ పారాయ‌ణం

TIRUMALA, 08 SEPTEMBER 2023: The third edition of Ayodhyakanda Akhanda Parayanam was held on Saturday at Nadaneerajanam platform in Tirumala.

SVBC telecasted the program live from 7 am to 8.30 am for the sake of global devotees.

A total of 139 shlokas from 9th to 11th sargas of Ayodhya Kanda and 25 shlokas of Yogavasistam, Dhanvantari Mahamantram were also rendered.

SV Vedic University, TTD Vedic Scholars, TTD Sambhavana Scholars, Annamacharya Project, National Sanskrit University Scholars, Dharmagiri pundits participated in this program.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

భక్తిభావాన్ని పంచిన అయోధ్యా కాండ‌ అఖండ పారాయ‌ణం

తిరుమ‌ల‌, 2023 సెప్టెంబ‌రు 09: ప్ర‌పంచంలోని ప్ర‌జ‌లంతా ఆయురారోగ్యా‌ల‌తో ఉండాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల‌ నాద‌నీరాజ‌నం వేదిక‌పై శ‌నివారం ఉద‌యం 7 నుండి 8.30 గంటల వరకు 3వ‌ విడ‌త అయోధ్యా కాండ‌ అఖండ పారాయ‌ణం భక్తజనరంజకంగా సాగింది.

ఇందులో 9 నుండి 11వ‌ సర్గల వ‌ర‌కు గ‌ల 139 శ్లోకాలను పారాయణం చేశారు. యోగవాసిష్టం – ధన్వంతరి మహామంత్రం 25 శ్లోకాలు పారాయణం చేశారు. వేద పండితులు అఖండ పారాయ‌ణం చేయ‌గా ప‌లువురు భ‌క్తులు భ‌క్తిభావంతో వారిని అనుస‌రించి శ్లోక పారాయ‌ణం చేశారు.

ధర్మగిరికి చెందిన ప్రఖ్యాత పండితులు శ్రీ రామానుజాచార్యులు ప్రతి శ్లోకం యొక్క ప్రాముఖ్యతను, శ్రీ అనంత వేణుగోపాల్ శ్లోక పారాయణం చేశారు. అఖండ పారాయ‌ణంలో ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల, ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం అధ్యాప‌కులు, ఎస్వీ ఉన్న‌త వేద అధ్యాయ‌న సంస్థకు చెందిన వేద పారాయ‌ణ దారులు, రాష్ట్రీయ‌ సంస్కృత విశ్వ‌విద్యాల‌యానికి చెందిన పండితులు పాల్గొన్నా‌రు.

ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ అధికారులు, పండితులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.