TIRUPPAVAI TO ENHANCE SPIRITUAL FERVOUR-JEO HEALTH AND EDUCATION _ భక్తిభావాన్ని పెంచేందుకే ధనుర్మాసంలో తిరుప్పావై ప్రవచనాలు : టిటిడి జెఈఓ(ఆరోగ్యం, విద్య) శ్రీమతి సదా భార్గవి

TIRUPATI, 15 DECEMBER 2020: Thiruppavai pravachanam program during Dhanurmasam is aimed at enhancing spiritual fervour among the devotees, said Smt Sada Bhargavi, TTD JEO for Health and Education.
 
Participating in the inaugural session of Thiruppavai pravachanam organised Annamacharya Kala Mandiram in Tirupati Smt. Sada Bhargavi said that in Bhagavad Gita Lord Himself declared that He is like Dhanurmasa among all the months which is considered most sacred and pious in the yearly calendar.
 
She said worshipping Lord Maha Vishnu in auspicious Dhanurmasa will yield fruitful results to the entire humanity.
 
HDPP and the Alwar Divya Prabandham project Director Sri Rajagopalan, Annamacharya Project Director Sri Dakshinamurthy, 
 
SVETA director Sri Rammanjula Reddy, Vedic scholar Sri Ranganathan were also present.
 
Meanwhile, this Pravachanam will last till January 14th at Annamacharya Kala Mandir in Tirupati.
 
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

భక్తిభావాన్ని పెంచేందుకే ధనుర్మాసంలో తిరుప్పావై ప్రవచనాలు : టిటిడి జెఈఓ(ఆరోగ్యం, విద్య) శ్రీమతి సదా భార్గవి

తిరుప‌తి, 2020 డిసెంబ‌రు 15: ప్రజల్లో భక్తిభావాన్ని పెంచేందుకే ధనుర్మాసంలో దేశవ్యాప్తంగా తిరుప్పావై ప్రవచన కార్యక్రమాలు తలపెట్టామని టిటిడి జెఈఓ(ఆరోగ్యం, విద్య) శ్రీమతి సదా భార్గవి తెలిపారు. టిటిడి ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో మంగళవారం సాయంత్రం తిరుప్పావై ప్రవచనాల ప్రారంభ సమావేశం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జెఈఓ మాట్లాడుతూ మాసాల్లో తాను మార్గశిరం లాంటి వాడినని సాక్షాత్తు శ్రీకృష్ణుడు భగవద్గీతలో తెలియజేశారని చెప్పారు. మార్గశిర మాసంలో విష్ణువును ఆరాధిస్తే సకలశుభాలు కలుగుతాయన్నారు. పవిత్రమైన ధనుర్మాసంలో భక్తులందరూ తిరుప్పావై ప్రవచనాలు విని తరించాలని కోరారు.

కాగా, ధనుర్మాసాన్ని పురస్కరించుకుని డిసెంబరు 16 నుంచి జనవరి 13వ తేదీ వరకు తిరుపతితోపాటు దేశవ్యాప్తంగా 141 కేంద్రాల్లో ప్రముఖ పండితులు తిరుప్పావై ప్రవచనాలు చేయనున్నారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఉదయం 7 నుండి 8 గంటల వరకు ఆచార్య సి.రంగ‌నాథ‌న్, కెటి రోడ్డులోని శ్రీ వరదరాజస్వామివారి ఆలయంలో ఉదయం 6 నుండి 7 గంటల వరకు శ్రీ రంగ‌రామానుజాచార్యులు తిరుప్పావై ప్రవచనాల పారాయణం చేస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆచార్య రాజగోపాలన్, అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు ఆచార్య ద‌క్షిణామూర్తి, శ్వేత సంచాల‌కులు డా. కె.రామాంజుల‌రెడ్డి, ఆచార్య సి.రంగ‌నాథ‌న్ పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.