TS GUV OFFERS PRAYERS IN TIRUMALA TEMPLE _ శీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్

Tirumala, 03 Dec. 22: The Governor of Telangana State, Smt Tamilisai Soundarajan on Saturday had darshan of Lord Venkateswara at Tirumala.

 

After darshan, she was presented with Srivari Thirtha Prasadams, a diary, and a calendar at Ranganayakula Mandapam by TTD EO Sri AV Dharma Reddy after Veda ashirvachanam by Veda pundits.

 

DyEO Sri Haridranath, VGO Sri Bal Reddy, Temple Peishkar Srihari and other officials were present 

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

శీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్

– సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనంపై ప్రశంసలు

తిరుమల, 2022 డిసెంబరు 03: తెలంగాణ గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్ శనివారం తిరుమల శీవారిని దర్శించుకున్నారు. గౌ.గవర్నరుకు ఆలయ మహాద్వారం వద్ద టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులం వేద ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఈవో శ్రీవారి తీర్థప్రసాదాలు, డైరీ, క్యాలెండర్ అందజేశారు.

ఈ సందర్భంగా రాత్రి నుండి కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు ఉదయం త్వరగా స్వామివారి దర్శనం కల్పించేందుకు బ్రేక్ దర్శన సమయాన్ని మార్పు చేశామని గౌ.గవర్నరుకు ఈఓ వివరించారు. టిటిడి నిర్ణయం చాలా బాగుందని, అందుబాటులోకి వచ్చిన అదనపు సమయంలో ఎక్కువమంది సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉందని గవర్నర్ ప్రశంసించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.