TTD COMMENCES CHUTNEY SERVING_ కంపార్ట్ మెంట్లలో భక్తులకు అల్పాహారంలో చట్నీ పంపిణీ ప్రారంభం

Tirumala, 14 April 2018: The Annaprasadam wing of TTD has commenced serving Annaprasadam on Saturday.

As per the instructions of TTD EO Sri Anil Kumar Singhal following requests from Pilgrim devotees during Dial your EO program, TTD has introduced chutney as side dish to upma and pongal in VQC compartments.

Tirumala JEO Sri KS Sreenivasa Raju commenced groundnut chutney serving to Pilgrims. Annaprasadam Special Officer Sri S Venugopal was also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATHI

కంపార్ట్ మెంట్లలో భక్తులకు అల్పాహారంలో చట్నీ పంపిణీ ప్రారంభం

తిరుమల, 2018, ఏప్రిల్ 14: తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసి కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులకు టిటిడి తిరుమల జెఈఓ శ్రీ కెఎస్.శ్రీనివాసరాజు శనివారం రాత్రి అల్పాహారంలో వేరుశనగ చట్నీ పంపిణీని ప్రారంభించారు. డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో భక్తుల సూచనలను పరిగణనలోకి తీసుకుని కంపార్ట్‌మెంట్లలో ఉప్మా, పొంగళ్‌తోపాటు చట్నీ కూడా అందించాలని ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ ఇటీవల ఆదేశించారు.

ఈ మేరకు జెఈఓ అన్నప్రసాదం అధికారులతో చర్చించి భక్తులు కోరిన విధంగా అల్పాహారం, అన్నప్రసాదాలు అందించాలని ఆదేశించారు. ఈ మేరకు కంపార్ట్‌మెంట్లలో ఉప్మా, పొంగళ్‌తోపాటు వేరుశనగ చట్నీని కూడా అందిస్తున్నారు.

జెఈఓ వెంట అన్నప్రసాదం ప్రత్యేకాధికారి శ్రీ వేణుగోపాల్ ఉన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.