TTD TO DISPATCH UGADI GREETING CARDS TO DONORS AND SEVAKULU_ దాతలకు, శ్రీవారి సేవకులకు శ్రీ విళంబినామ ఉగాది శుభాకాంక్షల పత్రికలు పంపనున్న టిటిడి

Tirumala, 9 March 2018: In a thanksgiving gesture, TTD is all set to dispatch Sri Vilambi Nama Ugadi Greeting Cards to Donors who had donated to various trusts and schemes of TTD and Srivari Seva team leaders who have been rendering impeccable services to visiting pilgrims.

It may be mentioned here that TTD run nine trusts and two schemes (which includes SVIMS and Cottage Donor Management Scheme). TTD has been dispatching greeting cards to the donors who have donated over one lakh from the past six years since 2012. This year TTD will forward the greeting cards to 56000 donors.

On the other hand, under the instructions of TTD EO Sri Anil Kumar Singhal and in the supervision of Tirumala JEO Sri KS Sreenivasa Raju, for the first time TTD will dispatch Ugadi Greeting Cards to 8000 Srivari Seva team leaders present in two Telugu States as a token of compliment for their services to pilgrims.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

దాతలకు, శ్రీవారి సేవకులకు శ్రీ విళంబినామ ఉగాది శుభాకాంక్షల పత్రికలు పంపనున్న టిటిడి

మార్చి 09, తిరుమల 2018: ఈ నెల 18వ తేదీన శ్రీ విళంబినామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని టిటిడి వివిధ పథకాలకు విరాళాలు అందించిన దాతలకు మరియు తిరుమల శ్రీవారిదర్శనార్థం విచ్చేసే లక్షలాదిమంది భక్తులకు విశేష సేవలందించే శ్రీవారి సేవకులకు ఉగాది శుభాకాంక్షల పత్రికలను (గ్రీటింగ్‌ కార్డ్స్‌) టిటిడి పంపనుంది.

టిటిడి ఆధ్వర్యంలో తొమ్మిది ట్రస్టులు, రెండు స్కీములు నడుస్తున్న విషయం విదితమే. వీటిలో అన్నప్రసాదం, ప్రాణదానం, విద్యాదానం, బర్డ్‌, సర్వశ్రేయ ట్రస్టు, పురతన ఆలయాల పరిరక్షణ, శంకర్‌ నేత్రాలయ, గో సంరక్షణ, వేద పరిరక్షణ ట్రస్టులు, ఆరోగ్య వర ప్రసాదిని స్కీము, కాటేజి డొనేషన్‌ స్కీములు ఉన్నాయి. లక్ష రూపాయలకు పైగా డొనేషన్‌ ఇచ్చిన దాతలకు 2012వ సంవత్సరం నుండి టిటిడి ఉగాది శుభాకాంక్షల పత్రికలను (గ్రీటింగ్‌ కార్డ్స్‌) పంపుతున్నది. ఇందులో భాగంగా టిటిడి దాతల విభాగం దాదాపు 56 వేలకు పైగా ఉన్న దాతలకు ఉగాది శుభాకాంక్షల పత్రికలను పంపనుంది.

టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆదేశాల మేరకు రెండు తెలుగు రాష్ట్రాలలోని 8 వేల మంది శ్రీవారి సేవకుల టీం లీడర్లకు తొలిసారిగా టిటిడి ఉగాది శుభాకాంక్షల పత్రికలను (గ్రీటింగ్‌ కార్డ్స్‌) పంపడానికి సిద్ధం చేసింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.