TTD TO MARKET 2019 DIARIES AND CALENDARS OVERSEAS THROUGH POSTAL DEPARTMENT-EO_ పోస్టల్‌ శాఖ ద్వారా విదేశాల్లోని భక్తులకు కూడా టిటిడి డైరీలు, క్యాలెండర్లు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Tirumala, 5 October 2018: Moving a step ahead, TTD will now deliver it’s 2019 Diaries and Calendars booked in online to overseas through postal department, said, TTD EO Sri Anil Kumar Singhal.

After Dial your EO program, talking to media persons at Annamaiah Bhavan in Tirumala on Friday he said, last year we commenced online sales of our diaries and calendars which received huge reception from public. We delivered them through postal department within the country. Now we are set for overseas delivery also, he added.

Later he said, some changes will be brought in online sale of arjitha seva tickets. “Keeping in view the misuse of these seva tickets by some miscreants we want to bring some amendments which will come in to force by next month. From unlimited registrations from a single mobile number and e-mail ID we now want to restrict it to only two registrations. Some pilgrims suggested to re-introduce photo upload also to avoid manipulation, which will be looked into”, he maintained.

The EO also said, online quota of booking of arjitha seva tickets is also introduced in Padmavathi temple at Tiruchanoor and the devotees can now register three months prior till two days before based on the availability of arjitha seva tickets in online.

He said that, towards the development of local temples under the umbrella of TTD, one senior officer has been allotted to each sub temple. This adoption will help in the better development. We have now sanctioned Rs.4.70cr towards the development of Appalayagunta temple”, he mentioned.

The EO said, at present, the average turnout of pilgrims at Kurukshetra temple is 750 per day and week ends around 1700. As Gita utsavams are famous here during December which lasts for over 11 days, we are anticipating nearly 2-3lakh pilgrims during that period, he added.

Tirumala JEO Sri KS Sreenivaas Raju, CE Sri Chandrasekhar Reddy, CVSO Incharge Sri Siva kumar Reddy were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

పోస్టల్‌ శాఖ ద్వారా విదేశాల్లోని భక్తులకు కూడా టిటిడి డైరీలు, క్యాలెండర్లు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

తిరుమల, 05 అక్టోబరు 2018: టిటిడి డైరీలు, క్యాలెండర్లను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే విదేశాల్లోని భక్తులకు పోస్టల్‌ శాఖ ద్వారా అందించే ఏర్పాట్లు చేపట్టామని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం జరిగిన డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం అనంతరం ఈవో మీడియాతో మాట్లాడారు. వారి మాటల్లోనే…

భక్తులకు అందుబాటులో 2019 టిటిడి డైరీలు, క్యాలెండర్లు :

– 2019వ సంవత్సరానికి గాను 12 పేజీల క్యాలెండర్లు, చిన్న డైరీలు, పెద్ద డైరీలు, శ్రీవారి పెద్ద క్యాలెండరు, శ్రీ పద్మావతి మరియు శ్రీవారి క్యాలెండరు, తెలుగు పంచాంగం క్యాలెండర్‌ భక్తులకు అందుబాటులో ఉంచాం. ఈ సంవత్సరం ప్రత్యేకంగా టేబుల్‌ టాప్‌ క్యాలెండర్లు 50 వేల కాపీలను భక్తులకు అందుబాటులో ఉంచాం. 12 పేజీల క్యాలెండర్‌, పెద్ద డైరీని భక్తులు బుక్‌ చేసుకునేందుకు వీలుగా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచడమైనది. భక్తులకు పోస్టల్‌ ద్వారా ఇంటికి చేరవేస్తారు.

శ్రీవారి నవరాత్రి బ్రహ్మూెత్సవాలకు ఏర్పాట్లు పూర్తి :

– అక్టోబరు 10 నుండి 18వ తేదీ వరకు జరుగనున్న శ్రీవారి నవరాత్రి సాలకట్ల బ్రహ్మూెత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశాం. విశేష సంఖ్యలో విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేపట్టాం.

– తమిళులకు పవిత్రమైన పెరటాశినెల, దసరా సెలవులు, శ్రీవారి నవరాత్రి బ్రహ్మూెత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉండటం వలన ఈ నెల 20, 21వ తేదీల వరకు రానున్న శని, ఆదివారాలలో దివ్యదర్శనం, సర్వదర్శనం టోకెన్లు రద్దు చేయడమైనది. రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను పరిమిత సంఖ్యలో జారీచేస్తున్నాం.

ఆకట్టుకునేలా కళాబృందాలు :

– శ్రీవారి వాహనసేవలలో భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, గుజరాత్‌, హర్యానా, ఛత్తీస్‌గడ్‌, కర్ణాటక, కేరళకు చెందిన కళాబృందాలు ప్రదర్శనలు ఇవ్వనున్నారు.

– ఇందులో భాగంగా ఆయా రాష్ట్రాల జానపద నృత్యాలు, పంతి డ్యాన్స్‌, ఒగ్గు డోలు, డప్పులు, పంచవాయిద్యాలు తదితర సాంప్రదాయ ప్రదర్శనలు ఇవ్వనున్నారు.

ఆన్‌లైన్‌లో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆర్జిత సేవా టికెట్లు :

– తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నిర్వహించే అన్నిరకాల ఆర్జిత సేవ టికెట్లను భక్తుల సౌకర్యార్థం అక్టోబరు 1వ తేదీ నుండి ఆన్‌లైన్‌లో ఉంచడమైనది.

– ఇందులో భాగంగా 50 శాతం టికెట్లు ఆన్‌లైన్‌లో, 50 శాతం టికెట్లు కరెంట్‌ బుకింగ్‌లో పొందవచ్చు.

– ఆన్‌లైన్‌లో 90 రోజుల ముందు నుండి అమ్మవారి ఆర్జిత సేవా టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు. అదే విధంగా, 48 గంటల ముందు వరకు కూడా ఆన్‌లైన్‌లో ఈ టికెట్లను బుక్‌ చేసుకునే అవకాశం కల్పించాం.

– తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రోజువారి జరిగే ఆర్జిత సేవలు.

సేవ ఆన్‌లైన్‌ బుకింగ్‌ కరంట్‌ బుకింగ్‌ మొత్తం

1. సుప్రభాతం 50 50 100

2. కల్యాణోత్సవం 50 50 100

3. అష్టదళపాదపద్మారాధన

(సోమవారం) 35 40 75

4. అష్టోత్తర శతకళశాభిషేకం

(బుధవారం) 15 15 30

5. తిరుప్పావడసేవ(గురువారం) 50 50 100

6. అభిషేకం(శుక్రవారం) 30 30 60

7. వస్త్రాలంకరణసేవ(శుక్రవారం) 5 2 7

8. లక్ష్మీపూజ(శుక్రవారం) 75 75 150

9. పుష్పాంజలిసేవ(శనివారం) 35 15 50

– టిటిడి అనుబంధ ఆలయాలైన అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబరు 5న పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. అక్టోబరు 7వ తేదీ వరకు జరగనున్నాయి.

అదేవిధంగా, తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయం, నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయాల్లో ఇటీవల పవిత్రోత్సవాలు నిర్వహించాం.

అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరాలయం :

– అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరాలయాన్ని ఒక రోజుకు దాదాపు 3 వేల మంది, శనివారం 10 వేల నుండి 15 వేల మంది భక్తులు దర్శించుకుంటున్నారు.

– ఈ ఆలయానికి భక్తుల సంఖ్య పెరుగుతుండడంతో రూ.4.70 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నాం. ఇందులో భాగంగా ఆలయంలో పోటు, యాగశాల, కార్యాలయ గది, ప్రసాద వితరణశాల, అఖండం, ఆలయం చుట్టూ కాలువలు, మాడ వీధుల్లో సిసి రోడ్ల విస్తరణ, టిటిడి కల్యాణమండపం, పూడి రైల్వేస్టేషన్‌ జంక్షన్‌ వద్ద ఆర్చి నిర్మాణం తదితర అభివృద్ధి పనులు చేపడుతున్నాం.

దర్శనం :

– గతేడాది సెప్టెంబరులో 21.35 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా ఈ ఏడాది సెప్టెంబరులో 23.39 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు.

హుండీ ఆదాయం :

– శ్రీవారి హుండీ ఆదాయం గతేడాది సెప్టెంబరులో రూ.76.28 కోట్లు కాగా, ఈ ఏడాది సెప్టెంబరులో రూ.87.84 కోట్లు వచ్చింది.

అన్నప్రసాదం :

– గతేడాది సెప్టెంబరులో 51.77 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదాలు అందివ్వగా, ఈ ఏడాది సెప్టెంబరులో 63.49 లక్షల మంది భక్తులకు అందజేయడం జరిగింది.

లడ్డూ లు :

– గతేడాది సెప్టెంబరులో 79.24 లక్షల లడ్డూలు అందించగా, ఈ ఏడాది సెప్టెంబరులో 97.87 లక్షల లడ్డూలను అందించాం.

తలనీలాలు :

– గతేడాది సెప్టెంబరులో 9.45 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించగా, ఈ ఏడాది సెప్టెంబరులో 9.82 లక్షల మంది తలనీలాలు సమర్పించారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.