TWO A/C LORRIES DONATED _ టిటిడికి రూ.80 లక్షల విలువైన 2 ఎసి కూరగాయల లారీలు విరాళం 

TIRUMALA, 14 JANUARY 2023: TVS company has donated two A/C lorries worth Rs.80lakhs to TTD on Saturday in Tirumala.

After performing pujas to the new vehicles, the Vice President of the Company Sri Selvam has donated the keys to TTD EO Sri AV Dharma Reddy.

The EO said these vehicles will be used to transport vegetables donated to TTD for Annaprasadam activities.

Tirumala DI Sri Janakirami Reddy was also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

టిటిడికి రూ.80 లక్షల విలువైన 2 ఎసి కూరగాయల లారీలు విరాళం

తిరుమల, 14 జనవరి 2023: టీవీఎస్ సంస్థ తరఫున ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ చెన్నైకి చెందిన శ్రీ సెల్వం శనివారం ఏసి సౌకర్యంతో కూడిన రెండు కూరగాయల లారీలను టిటిడికి విరాళంగా అందించారు. ఈ వాహనాల విలువ రూ.80 లక్షలని దాత తెలిపారు.

ముందుగా శ్రీవారి ఆలయం ఎదుట కొత్త వాహనాలకు పూజలు నిర్వహించిన అనంతరం దాత టిటిడి ఈవో శ్రీ ఎవి. ధర్మారెడ్డికి తాళం చెవులను అందజేశారు.

ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ అన్నప్రసాద కార్యకలాపాలకు కూరగాయలను తీసుకెళ్లేందుకు ఎసితో ఈ వాహనాలను ప్రత్యేకంగా రూపొందించినట్లు తెలిపారు. దాతలకు శ్రీవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో డిఐ శ్రీ జానకిరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.