UNION MINISTER OFFERS PRAYERS_ శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర ఆర్థిక‌ మంత్రి గౌ|| శ్రీమ‌తి నిర్మ‌లా సీతారామ‌న్‌

Tirumala, 18 Aug. 19: Union Minister for Finance Smt Nirmala Sitaraman offered prayers in the Hill Shrine of Sri Venkateswara Swamy on Sunday morning.

After darshan, she was rendered Vedasirvachanam by the vedaparayanamdars of the temple at Ranganayakula Mandapam.

SO Sri AV Dharma Reddy, CVSO Sri Gopinath Jatti, Temple DyEO Sri Harindranath were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర ఆర్థిక‌ మంత్రి గౌ|| శ్రీమ‌తి నిర్మ‌లా సీతారామ‌న్‌

ఆగ‌స్టు 18, తిరుమల 2019: కేంద్ర ఆర్థిక‌ శాఖ మంత్రి గౌ|| శ్రీమ‌తి నిర్మ‌లా సీతారామ‌న్ ఆదివారం ఉదయం విఐపి బ్రేక్‌లో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

ముందుగా ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకున్న కేంద్ర మంత్రికి టిటిడి తిరుమ‌ల ప్ర‌త్యేకాధికారి శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా స్వాగ‌తం ప‌లికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వ‌చ‌నం చేశారు. ఈ సంద‌ర్భంగా శ్రీమ‌తి నిర్మ‌లా సీతారామ‌న్‌కు శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని ప్ర‌త్యేకాధికారి అంద‌జేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి సివిఎస్‌వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, పేష్కార్ శ్రీ లోక‌నాథం ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.