VASANTHOTSAVAM ON DAY TWO _ తిరుచానూరులో రెండో రోజు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు

Tiruchanoor, 7 May 20: The annual three day vasanthotsavams at Tiruchanoor reached second day on Thursday.

The Archakas performed snapanam with milk, honey, curd, sandal, turmeic, vermilion and coconut water to processional deity of Ammavaru seated on a platform in Sri Krishna Mukha Mandapam as per Pancharatra Agama Vidhi.

Temple DyEO Smt Jhansi Rani, Agama Advisor Sri Srinivasacharyulu, Kankana Bhattar Sri Manikantha Swamy, AEO Sri Subramanyam were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

తిరుచానూరులో రెండో రోజు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు
 
తిరుపతి, 2020 మే 07:  తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు గురువారం రెండో రోజుకు చేరుకున్నాయి. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఈ ఉత్స‌వాల‌ను ఆల‌య ప్రాంగ‌ణంలోనే ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.

వసంతోత్సవాల్లో భాగంగా మ‌ధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంటల వరకు ఆల‌యంలోని ఆశీర్వ‌చ‌న మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం చేపట్టారు.  ఇందులో భాగంగా పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. అలాగే రాత్రి 7 నుండి 7.30 గంటల వరకు ఆల‌య ప్రాంగ‌ణంలోనే అమ్మవారి ఊరేగింపు నిర్వ‌హిస్తారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటి ఈఓ శ్రీమతి ఝాన్సీరాణి, ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, ఏఈఓ శ్రీ సుబ్రమణ్యం, కంకణభట్టార్ శ్రీ మణికంఠస్వామి, సూప‌రింటెండెంట్ శ్రీ గోపాల‌కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.