VASANTHOTSAVAMS IN BENGALURU INFO CENTRE FROM MARCH 29 TO 31_ మార్చి 29 నుంచి 31వ తేదీ వరకు బెంగళూరులోని శ్రీ వేంకటేశ్వరాలయంలో వార్షిక వసంతోత్సవాలు

Tirupati, 27 Mar. 18: The three day annual vasanthotsavams will be observed in the TTD information centre at Bengaluru from March 29 to 31.

Every day there will be snapana tirumanam to utsavarulu between 3pm and 4:30pm followed by asthanam and unjal seva.

The grihas can pay Rs.500 per ticket on which two persons will be allowed.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI< మార్చి 29 నుంచి 31వ తేదీ వరకు బెంగళూరులోని శ్రీ వేంకటేశ్వరాలయంలో వార్షిక వసంతోత్సవాలు

మార్చి 27, తిరుపతి, 2018: టిటిడికి అనుబంధంగా ఉన్న బెంగళూరు నగరంలోని వయ్యాలికావల్‌లో గల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మార్చి 29 నుంచి 31వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి.

ఈ సందర్భంగా ప్రతిరోజూ సాయంత్రం 3 నుండి 4.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం, సాయంత్రం 5.30 నుంచి 6 గంటల వరకు అస్థానం చేపడతారు. సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా నిర్వహిస్తారు.

గృహస్తులు (ఇద్దరు) రూ.500/- చెల్లించి ఒక రోజు వసంతోత్సవంలో పాల్గొనవచ్చు. ఈ సేవలో పాల్గొన్న భక్తులకు ఒక అంగవస్త్రం, రవికె, ఒక పెద్ద లడ్డూ, ఒక వడ బహుమానంగా అందజేస్తారు. టిటిడి బెంగళూరు డెప్యూటీ ఈవో శ్రీ కె.కృష్ణమూర్తి ఈ ఉత్సవాల ఏర్పాట్ల్లను పర్యవేక్షిస్తున్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.