VENGAMAMBA VARDHANTHI POSTERS RELEASED_ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 201వ వర్ధంతి ఉత్సవాల పోస్టర్లు ఆవిష్కరణ :తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

Tirupati, 13 August 2018: Matrusri Tarigonda Vengamamba 201st Vardhanthi posters were released by TTD Tirupati JEO Sri P Bhaskar along with TTD Trust Board Member Smt Sudha Naryanamurthy in Tirupati on Monday.

The poster release took place at New Employees Canteen.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 201వ వర్ధంతి ఉత్సవాల పోస్టర్లు ఆవిష్కరణ :తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

తిరుపతి, 2018 ఆగస్టు 13: మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 201వ వర్ధంతి ఉత్సవాల పోస్టర్లను సోమవారం టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ అవిష్కరించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనం ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ఉద్యోగుల క్యాంటీన్‌లో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా తిరుపతి జెఈవో మాట్లాడుతూ ఆగస్టు 18, 19వ తేదీలలో తిరుమల, తిరుపతి, తరిగొండలో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీమతి సుధా నారాయణమూర్తి, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ కె.జె.కృష్ణమూర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇందులో భాగంగా వెంగమాంబ జన్మస్థలమైన తరిగొండలో కొలువైన శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి ఆలయంలో ఆగస్టు 18వ తేదీ సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదేవిధంగా ఆగస్టు 19వ తేదీ సాయంత్రం 6.00 గంటల నుండి రాత్రి 8.00 గంటల వరకు శ్రీలక్ష్మీనృసింహస్వామివారికి కల్యాణోత్సవం, రాత్రి 8.00 నుండి 9.30 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.

తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఆగస్టు 18వ తేదీన ఉదయం 10.00 నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు తరిగొండ వెంగమాంబ సాహిత్యంపై సదస్సు నిర్వహించనున్నారు. అదేరోజు సాయంత్రం 6.00 గంటల నుండి 8.00 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆగస్టు 19వ తేదీ ఉదయం 11.30 గంటలకు ఎం.ఆర్‌.పల్లి సర్కిల్‌ వద్ద ఉన్న తరిగొండ వెంగమాంబ విగ్రహానికి టిటిడి అధికారులు పుష్పాంజలి ఘటిస్తారు. సాయంత్రం 6.00 గంటల నుండి రాత్రి 8.00 గంటల వరకు అన్నమాచార్య కళామందిరంలో ప్రముఖ కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఆగస్టు 19వ తేదీ ఉదయం 9.00 గంటలకు తిరుమలలోని తరిగొండ వెంగమాంబ బృందావనంలో టిటిడి ఉన్నతాధి కారులు పుష్పాంజలి సమర్పించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.