డిసెంబర్ 10న మొదటి ఘాట్‌లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి ప్రత్యేక అభిషేకం

డిసెంబర్ 10న మొదటి ఘాట్‌లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి ప్రత్యేక అభిషేకం

తిరుమల, 2023 డిసెంబర్ 09: తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులోని నడకమార్గం చెంత వెలసివున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి ఆదివారం ప్రత్యేక అభిషేకం నిర్వహించనున్నారు. కార్తీక మాసంలో స్వాతి తిరునక్షత్రం సందర్భంగా ప్రతి సంవత్సరం ఆలయంలో ప్రత్యేక అభిషేకం నిర్వహించడం ఆనవాయితీ.

శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో మూలమూర్తికి ఉదయం పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపులతో విశేషంగా అభిషేకం నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు ఆలయ అర్చకులు పాల్గొంటారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.