నవంబర్ 21న తిరుమల శ్రీవారి ఆలయంలో కార్తీక పర్వదీపోత్సవం

నవంబర్ 21న తిరుమల శ్రీవారి ఆలయంలో కార్తీక పర్వదీపోత్సవం

తిరుపతి, 2010 నవంబర్‌-8: తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబర్‌ 21వ తేదిన వార్షిక కార్తీక పర్వదీపోత్సవం కన్నుల పండుగగా నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా నవంబర్‌ 21వ తేదిన శ్రీవారి ఆలయంలో నిర్వహించే వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దుచేశారు. అదేవిధంగా డిశెంబర్‌ 1వ తేది తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో కార్తీక దీపోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.