ఆగష్టు 1న పౌర్ణమి గరుడ సేవ

ఆగష్టు 1న పౌర్ణమి గరుడ సేవ

తిరుమల, 2023 జులై 31: అధిక శ్రావణ మాస పౌర్ణమి గరుడసేవ తిరుమలలో ఆగష్టు 1న
జరుగనుంది.

ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే.

ఇందులో భాగంగా రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.