ఆగస్టు 26న పుదుచ్చేరిలో శ్రీనివాస కళ్యాణం 

తిరుపతి, ఆగస్టు 25: తితిదే శ్రీ కళ్యాణోత్సవం ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆగస్టు 26వ తేదీన పుదుచ్చేరిలో శ్రీనివాస కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. శ్రీ వేంకటేశ్వరస్వామి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసేందుకు తితిదే దేశ విదేశాల్లో శ్రీనివాస కళ్యాణాలు నిర్వహిస్తోంది.

ఇందులో భాగంగా పుదుచ్చేరిలో స్వామివారి కళ్యాణం తలపెట్టింది. సుదూర ప్రాంతాల నుండి వ్యయ ప్రయాసల కోర్చి స్వామివారిని దర్శించుకోలేని భక్తులకు స్వామివారి కళ్యాణం కనువిందు కానుంది. శ్రీ కళ్యాణోత్సవం ప్రాజెక్టు ఓఎస్‌డి శ్రీ కె.రామకృష్ణ ఈ కళ్యాణోత్సవం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.