ఘనంగా అన్నమయ్య బహుళ ద్వాదశి

ఘనంగా అన్నమయ్య బహుళ ద్వాదశి

 తిరుపతి, జూలై 04, 2013: పరమపవిత్రమైన ద్వాదశి తిథినాడు పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు శ్రీవారిలో ఐక్యమైన మహత్తర సందర్భాన్ని పురస్కరించుకుని తితిదే గురువారం నాడు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ‘అన్నమయ్య బహుళ ద్వాదశి’ని ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా మధ్యాహ్నం 1.00 గంటకు భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. అంతకుముందు ఉదయం 10.00 గంటల నుండి దినము ద్వాదశి సంకీర్తనలతో అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గోష్ఠిగానం నిర్వహించారు. అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుడు శ్రీ పి.వెంకటకృష్ణయ్య భాగవతార్‌ ”రామాయణంలో రాముడు” అనే అంశంపై హరికథా పారాయణం చేశారు.
సాయంత్రం 6.00 నుండి 7.00 గంటలకు తిరుపతికి చెందిన ఆచార్య చిట్రాజు గోవిందరాజు ”అన్నమయ్య భక్తితత్త్వం” అనే అంశంపై ఉపన్యసించనున్నారు. అనంతరం సంగీత సభ జరుగనున్నాయి. ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు ఇన్‌చార్జ్‌ సంచాలకులు శ్రీ మునిరత్నంరెడ్డి, ఇతర అధికారులు, విశేషసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
              
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.