జూలై 6న తితిదే ఈవో శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం వీడ్కోలు సభ


జూలై 6న తితిదే ఈవో శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం వీడ్కోలు సభ

తిరుపతి, జూలై 04, 2013: తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం బదిలీ సందర్భంగా శనివారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఘనంగా వీడ్కోలు సభ జరుగనుంది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తితిదే ఉద్యోగులు, అభిమానులు పాల్గొనాలని విజ్ఞప్తి చేయడమైనది. ఇదే కార్యక్రమంలో తితిదే నూతన ఈవో శ్రీ ఎంజి.గోపాల్‌కు ఘనమైన ఆహ్వానం పలకనున్నారు. ఈ వేదికపై సంగీత కార్యక్రమాలతో పాటు తితిదే ఉన్నతాధికారులు తమ సందేశాలను అందజేస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.