మార్చి 13న విద్యార్థుల సక్సెస్ మీట్

మార్చి 13న విద్యార్థుల సక్సెస్ మీట్

– వివిధ అంశాల్లో ప్రతిభ కనబరిచినవారికి అఛీవర్ అవార్డులు

తిరుపతి, 2023 మార్చి 11: టీటీడీ విద్యాసంస్థల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులను అభినందించి అఛీవర్ అవార్డులు ప్రదానం చేసేందుకు మార్చి 13వ తేదీ సాయంత్రం 4 గంటలకు తిరుపతి మహతి ఆడిటోరియంలో స్టూడెంట్స్ సక్సెస్ మీట్ నిర్వహించనున్నారు.

టీటీడీ విద్యాసంస్థల్లో అకడమిక్స్, ఎన్.సి.సి, ఎన్ఎస్ఎస్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, కల్చరల్, కో కరికులర్, కాంపిటీటివ్ ఎగ్జామ్స్, ప్లేస్మెంట్స్ తదితర అంశాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 240 మంది విద్యార్థిని విద్యార్థులకు ఈ సందర్భంగా మెడల్స్, ప్రశంసాపత్రాలు అందజేస్తారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి ఇతర విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపేందుకు టీటీడీ విద్యాసంస్థలు మొట్టమొదటిసారిగా ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తుండడం విశేషం. టీటీడీ విద్యాశాఖాధికారి డా.ఎం.భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.