ADHYAYANOTSAVAMS CONCLUDES _ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ముగిసిన అధ్యయనోత్సవాలు

Tirupati, 24 Feb. 22: The 25 day long festival, Adhyayanotsavams concluded in Sri Govindaraja Swamy temple on Thursday.

 

Due to Covid restrictions, the festival was observed in Ekantam. This festival commenced on February 1.

 

Both the Senior and Junior Pontiffs of Tirumala, Special Grade DyEO Sri Rajendrudu and others were present.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ముగిసిన అధ్యయనోత్సవాలు

తిరుపతి, 2022 ఫిబ్ర‌వ‌రి 24: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఫిబ్ర‌వ‌రి 1న ప్రారంభమైన అధ్యయనోత్సవాలు గురువారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఇందులో భాగంగా ఆలయంలో ఉదయం 6 గంటలకు శ్రీ గోవిందరాజ స్వామివారు, శ్రీ ఆండాళ్‌ అమ్మవారు, శ్రీ విష్వ‌క్సేనుల‌వారు, శ్రీరామానుజాచార్యులు, శ్రీ న‌మ్మాళ్వార్‌, శ్రీ కూర‌త్తాళ్వార్‌, శ్రీ తిరుమంగైయాళ్వార్ ఉత్సవమూర్తులకు తిరుమంజనం, ఆస్థానం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఆలయ ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ‌ రాజేంద్రుడు, ఏఈవో శ్రీ రవికుమార్ రెడ్డి, సూపరింటెండెంట్లు శ్రీ నారాయ‌ణ‌, శ్రీ వెంక‌టాద్రి టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్లు శ్రీ కామ‌రాజు, శ్రీ ధనంజయుడు, ఆల‌య అర్చ‌కులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.