ALL SET FOR MAHA SIVA RATRI ON FEB 18 _ శ్రీకపిలేశ్వరాలయంలో మహాశివరాత్రికి ఏర్పాట్లు పూర్తి

TIRUPATI, 17 FEBRUARY 2023: TTD has made elaborate arrangements for the visiting devotees at Sri Kapileswara Swamy temple on February 18.

The arrangements included parking, barricading, queue lines, shades, Annarpasadam, water distribution, security etc. are being planned in an elaborate manner to meet the pilgrim crowd.

The important rituals on Saturday includes Mahanyasapoorvaka Ekadasa Rudrabhishekam will be performed between 2.30am and 4.30am on the day of Maha Sivaratri while Rathotsavam between 8am and 10am followed by Snapana Tirumanjanam. 

In the evening, between 6pm and 10pm, the Nandi Vahana Seva is observed while the devotees will be allowed for darshan between 5.30am and 2pm, again between 4.30pm and 12mid night.

TTD has also arranged important devotional cultural programs on the auspicious occasion.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీకపిలేశ్వరాలయంలో మహాశివరాత్రికి ఏర్పాట్లు పూర్తి

– అర్ధరాత్రి వరకు సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు

తిరుపతి, 17 ఫిబ్రవరి 2023: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫిబ్ర‌వ‌రి 18వ తేదీ శనివారం మహాశివరాత్రి పర్వదినాన్ని ఘ‌నంగా నిర్వహించనున్నారు. విశేషంగా భక్తులు విచ్చేసే అవకాశం ఉండడంతో ప్రత్యేకంగా క్యూలైన్లు, చలువపందిళ్లు, పార్కింగ్ ప్ర‌దేశాలు ఏర్పాటు చేశారు.

మహాశివరాత్రి సందర్భంగా శనివారం తెల్లవారుజామున 2.30 గంటల నుండి 4.30 గంట‌ల వ‌ర‌కు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు రథోత్సవం(భోగితేరు), ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు స్నపనతిరుమంజనం, సాయంత్రం 6 నుండి రాత్రి 10 గంటల వరకు విశేషమైన నంది వాహనసేవ జరుగనున్నాయి.

ఉదయం 5.30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, సాయంత్రం 4.30 నుండి రాత్రి 12 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. ఫిబ్ర‌వ‌రి 19వ తేదీ ఆదివారం తెల్లవారుజామున 12 నుండి ఉదయం 4 గంటల వరకు లింగోద్భవకాల అభిషేకం నిర్వహిస్తారు.

ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయంలో మహాశివరాత్రి సందర్భంగా శనివారం ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు హరికథ, ఉద‌యం 10.30 నుంచి మ‌ధ్యాహ్నం 3 గంటల వరకు భక్తిసంగీతం, హ‌రిక‌థ‌ కార్య‌క్ర‌మాలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శివపురాణం ప్రవచనం, సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో సంగీత, నృత్య కార్యక్రమాలు జరుగనున్నాయి. అదేవిధంగా, రాత్రి 9.30 నుంచి 11 గంటల వరకు నృత్య ప్రదర్శన, రాత్రి 11 నుంచి 12.30 గంటల వరకు శివోహం భజన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.