అష్టోత్తర శతకుండాత్మక అద్భుత మహాశాంతియాగం
అష్టోత్తర శతకుండాత్మక అద్భుత మహాశాంతియాగం తిరుపతి, జనవరి 29, 2011: ఈ విశ్వంలోని మానవులందరూ సుఖసంతోషాలతో, ప్రేమానురాగాలతో, సమైక్యభావనతో జీవించాలనే మహదాశయంతో తిరుమల తిరుపతి దేవస్థానముల వారు హిందూధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని శ్రీనివాసమంగాపురం కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం వద్ద వున్న విశాల ప్రాంగణంలో అష్టోత్తర శత (108) కుండాత్మక అద్భుతమహాశాంతియాగాన్ని వైఖానసఆగమోక్తంగా ఈనెల 29,30,31 తేదీలలో త్రయాహ్నిక దీక్షతో నిర్వహిస్తున్నారు. సృష్టిలోని ప్రాణికోటికే కాకుండా విశ్వేదేవతలు కూడా ఇలాంటి యాగాల వల్ల […]