జనవరి 5న డయల్‌ యువర్‌ ఈవో

జనవరి 5న డయల్‌ యువర్‌ ఈవో

తిరుమల, 2018 జనవరి 03: ప్రతినెలా మొదటి శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఉదయం 8.30 గం||ల నుండి ఉదయం 9.30 గం||ల నడుమ నిర్వహించే డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం జనవరి 5వ తేదీన జరుగనుంది.

ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చును. అందుకు భక్తులు సప్రదించవలసిన నెంబరు. 0877-2263261.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.