ALWAR DIVYA PRABANDHA PARAYANAM IN TIRUMALA_ నవంబరు 4న తిరుమలలో పౌర్ణమి గరుడసేవ

Tirumala, 2 November 2017: In connection with Pournami Garuda Seva Nalayira Divya Prabandha Parayanam will be rendered in front of Garuda Seva in Tirumala on November 4.

Sri Malayappa Swamy will be taken on a procession on Garuda Vahanam on the auspicious day between 7pm and 9pm in four mada streets of Tirumala.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

నవంబరు 4న తిరుమలలో పౌర్ణమి గరుడసేవ

నవంబరు 02, తిరుమల, 2017: తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబరు 4వ తేదీ శనివారం పౌర్ణమి గరుడసేవ ఘనంగా జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్పస్వామివారు తనకు ప్రీతిపాత్రమైన గరుడవాహనంపై ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఈ సందర్భంగా దివ్యప్రబంధ మహోత్సవం జరుగనుంది. ద్రావిడ వేద నాలాయిర దివ్యప్రబంధ పారాయణ పథకంలోని దాదాపు 200 మంది పారాయణదారులు శ్రీవారి పౌర్ణమి గరుడసేవలో నాలాయిర దివ్యప్రబంధ పారాయణం చేస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.