PRIZE DISTRIBUTION TO WINNERS OF 36th DHARMIC EXAMS ON AUG 31_ ఆగస్టు 31న సనాతన ధార్మిక పరీక్షల విజేతలకు బహుమతుల ప్రదానం

Tirupati, 29 Aug. 19: All the winners of 36thDharmic examinations for school students of AP Telangana and Chennai will be distributed at Mahati auditorium on Saturday, August 31 evening.

Nearly 42,982 students participated in the exams held in 585 centers and 39, 431 students passed of which prizes were being given to state and district wise performers tomorrow.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆగస్టు 31న సనాతన ధార్మిక పరీక్షల విజేతలకు బహుమతుల ప్రదానం

తిరుపతి, 2019 ఆగస్టు 29: టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన 36వ సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షల విజేతలకు ఆగస్టు 31వ తేదీన శనివారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో బహుమతులు ప్రదానం చేయనున్నారు. ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం మొదలవుతుంది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలతో పాటు చెన్నైకి చెందిన విద్యార్థులకు ఇక్కడ బహుమతులు ప్రదానం చేస్తారు.

ఈ ఏడాది జనవరి 27వ తేదీన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలతోపాటు చెన్నై నగరంలో కలిపి 585 కేంద్రాల్లో సుమారు 42,992 వేల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయగా, వీరిలో 39,431 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో రాష్ట్రస్థాయిలో, జిల్లా స్థాయిలో పలువురు విద్యార్థులు ప్రతిభ కనబరిచారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.