టిటిడి పరిపాలనా భవనంలో పంద్రాగస్టు వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

టిటిడి పరిపాలనా భవనంలో పంద్రాగస్టు వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

తిరుపతి, 2018 ఆగస్టు 14: భారత స్వాతంత్య్ర దినం ఆగస్టు 15న నిర్వహించే వేడుకలకు టిటిడి సిద్ధమవుతోంది. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం ప్రాంగణంలో గల పరేడ్‌ మైదానంలో వేదికను అందంగా ముస్తాబు చేశారు. బుధవారం ఉదయం 8.30 గంటలకు పంద్రాగస్టు వేడుకలు ప్రారంభమవుతాయి. జెండా వందనం అనంతరం టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తరువాత విధుల్లో ఉత్తమ సేవలు అందించిన వివిధ విభాగాలకు చెందిన మొత్తం 191 మంది ఉద్యోగులలో 21 మంది అధికారులు, 34మంది ఈ ఏడాది పదవి విరమణ పొందేవారు, 136 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరికి ఐదు గ్రాముల వెండి డాలర్‌, ప్రశంసాపత్రాలు అందజేస్తారు. చివరగా టిటిడి విద్యాసంస్థల విద్యార్థులు, ఉద్యోగుల పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.