LOCAL TEMPLES OBSERVE RADHASAPTAMI WITH SPIRITUAL ECSTASY _ టిటిడి అనుబంధ ఆలయాలలో వైభ‌వంగా రథసప్తమి

TIRUPATI, 27 JANUARY 2023: All the local temples under the umbrella of TTD have geared up to observe Radhasapthami on Saturday.

Tiruchanoor, Srinivasa Mangapuram, Kodandarama temple, Appalayagunta, Karvetinagaram, Nagalapuram, Narayanavanam, etc. are spruced up for the big fete.

The Deputy EOs of the respective temples are taking care of the arrangements for Radha Sapthami.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

టిటిడి అనుబంధ ఆలయాలలో వైభ‌వంగా రథసప్తమి

తిరుపతి, 2023 జనవరి 28 ;టిటిడి అనుబంధ ఆల‌యాలు తిరుపతిలోని శ్రీకోదండరామాలయం, శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, చంద్రగిరిలోని శ్రీకోదండరామస్వామివారి అలయం, అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయం, కార్వేటినగరంలోని శ్రీవేణుగోపాలస్వామివారి ఆలయం, నాగలాపురంలోని శ్రీవేదనారాయణస్వామివారి ఆలయాల్లో రథసప్తమి పర్వదినాని శనివారం అత్యంత‌ వైభంవ‌గా నిర్వ‌హించారు.

శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో…

తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శనివారం ఉదయం 7 గంటలకు సూర్యప్రభవాహనం స్వామివారు భక్తులను కటాక్షించారు. రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ నాగరత్న, ఏఈవో శ్రీ మోహన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో….

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఉదయం 6 నుండి 7 గంటల వరకు బంగారు తిరుచ్చిపై స్వామివారు దేవేరులతో కలసి ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించారు. అనంతరం ఆలయంలో ఆస్థానం చేపట్టారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈఓ శ్రీమతి వరలక్ష్మి, సూపరిండెంట్ శ్రీ చంగల్ రాయులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

చంద్రగిరిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ….

చంద్రగిరిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఉదయం 9 నుండి 11 గంటల వరకు తిరుచ్చిపై స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఆలయంలో ఆస్థానం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీఈఓ శ్రీ దేవేంద్ర బాబు, ఏఈఓ పార్థసారథి, సూపరిండెంట్ శ్రీ శ్రీనివాసులు, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ….

నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఉదయం 6.30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు సూర్యప్రభ, హంస, చిన్నశేష, కల్పవృక్ష, పెద్దశేష వాహన సేవలు, తిరుచ్చి ఉత్సవం వైభవంగా నిర్వహించారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు చంద్రప్రభ వాహనాలపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీఈఓ శ్రీమతి నాగరత్న, సూపరిండెంట్ శ్రీ ఏకాంబరం, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో ….

నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు సూర్యప్రభ, హంస, కల్పవృక్షవాహన సేవలు, తిరుచ్చి ఉత్సవంపై స్వామివారు ఊరేగి భక్తులను కటాక్షించారు. సాయంత్రం 4.30 నుండి రాత్రి 8 గంటల వరకు శేషవాహనం, చంద్రప్రభ వాహనాలపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు తిరువీధి ఉత్సవం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో సూపర్డెంట్ శ్రీమతి వాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శివకుమార్ పాల్గొన్నారు.

కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో 6.30 నుండి 7.30 గంటల వరకు స్వామివారికి తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.