PEDDA SESHA VAHANA HELD _ జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పెద్దశేష వాహనసేవ

TIRUPATI, 01 MARCH 2022: As part of the annual Brahmotsavams which commenced in Sri Venkateswara temple at Jubilee Hills in Hyderabad, Pedda Sesha Vahanam was observed on Monday evening.

LAC chief Sri Bhaskar Rao, LAC deputy chief Sri Venkat Reddy, AEO Sri Jaganmohanacharyulu were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పెద్దశేష వాహనసేవ

తిరుపతి, 2022 మార్చి 01: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు మంగళవారం ఉదయం ధ్వజారోహణంతో శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు రాత్రి 8 గంటలకు పెద్ద‌శేష వాహనంపై స్వామివారు అభయమిచ్చారు.

బ్ర‌హ్మోత్స‌వాల్లో ప్రతిరోజూ ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 8 గంటల నుండి 9గంటల వరకు వాహ‌న‌సేవ‌లు నిర్వ‌హిస్తారు.

ఈ కార్యక్రమంలో హైద‌రాబాద్ స్థానిక స‌ల‌హామండ‌లి అధ్య‌క్షులు శ్రీ భాస్క‌ర్ రావు, ఉపాధ్యక్షులు శ్రీ వెంకట్ రెడ్డి, ఏఈఓ శ్రీ జగన్మోహనాచార్యులు ఇత‌ర స‌భ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.