PRIVILEGE DARSHANS BY TTD ON JULY 24 AND 25_ జూలై 24న వృద్ధులు, దివ్యాంగులకు, జూలై 25న చంటిపిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం

Tirumala, 22 July 2018: The privilege darshan to aged and specially abled by TTD will be on July 24 while for parents with children below five years on July 25.

Since last August TTD has been implementing this darshan on any two days in a month during the lean season of a year.

It may be mentioned here that TTD has cancelled privilege darshan in May and June in view of heavy summer rush and resumed it in July.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

జూలై 24న వృద్ధులు, దివ్యాంగులకు, జూలై 25న చంటిపిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం

జూలై 22, తిరుమల 2018: ఎక్కువ మంది వయో వృద్ధులు, దివ్యాంగులకు, 5 సంవత్సరాలలోపు చంటి పిల్లలకు, వారి తల్లిదండ్రులకు శ్రీవారి దర్శనం కల్పించాలన్న ఉన్నతాశయంతో టిటిడి ప్రతి నెలా రెండు సామాన్య దినాలలో వీరికి ప్రత్యేక దర్శనాలను కల్పిస్తుంది.

ఇందులో భాగంగా జూలై 24వ తేదీ మంగళవారం వయోవృద్ధులు (65 సం||ల పైబడినవారు), దివ్యాంగులకు కలిపి 4 వేల టోకెన్లను టిటిడి జారీ చేయనుంది.ఉదయం 10.00 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు, మధ్యాహ్నం 2.00 గంటలకు 2 వేల టోకెన్లు, 3.00 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు జారీ చేస్తారు. వృద్ధులు, దివ్యాంగులకు ప్రతిరోజు ఉదయం 10.00 గంటల స్లాట్‌కు 700 మందికి, మధ్యాహ్నం 3.00 గంటల స్లాట్‌కు 700 మందికి టోకెన్లు జారీ చేస్తున్న విషయం విదితమే.

తిరుమలలోని ఎస్వీ మ్యూజియం ఎదురుగా ఆధార్‌ లేదా ఓటరు గుర్తింపు కార్డుతో టోకెన్‌ పొంది శ్రీవారి దర్శనం చేసుకున్న వృద్ధులు, దివ్యాంగులను తిరిగి 90 రోజుల తరువాత మాత్రమే ఈ ప్రత్యేక క్యూలైన్‌ ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. వృద్ధులు, దివ్యాంగులు రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా, ఈ అవకాశన్ని సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతుంది.

5 సంవత్సరాలలోపు చంటి పిల్లలను, వారి తల్లిదండ్రులను జూలై 25వ తేదీ బుధవారం

ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు సుపథం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. సాధారణ రోజుల్లో ఒక సంవత్సరంలోపు చంటిపిల్లలకు, వారి తల్లిదండ్రులకు సుపథం మార్గం ద్వారా ప్రవేశం కల్పిస్తారు. భక్తుల కోరిక మేరకు ఐదేళ్లలోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను ఈ రెండు రోజుల్లో సుపథం మార్గం ద్వారా అనుమతిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.