SAINT SRI TYAGARAJA SWAMY 251ST JAYANTHI IN KAKARLA ON APRIL 21_ ఏప్రిల్‌ 21న కాకర్లలో శ్రీత్యాగరాజస్వామి జయంతి

Tirumala, 12 April 2018: The 251st Jayanthi celebrations of Carnataka Sangeetha Pitamaha, Sri Tyagaraja Swamy will observed in a grand manner by TTD in his home turf of Kakarla in Prakasam district on April 21st.

Devotional vocal with the rendition of the sankeertans of Sri Tyagaraja Swamy will be performed in TTD Dhyana Mandiram located in Kakarla from 4pm on wards. Later in the evening Srinivasa Kalyanam will be performed between 6pm and 8pm.

The officials of HDPP and SV College of Music and Dance of TTD will be supervising the arrangements for the mega devotional musical fete.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATHI

ఏప్రిల్‌ 21న కాకర్లలో శ్రీత్యాగరాజస్వామి జయంతి

తిరుపతి, 2018 ఏప్రిల్‌ 12: ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తెలుగు వాగ్గేయకార చక్రవర్తి శ్రీత్యాగరాజస్వామివారి 251వ జయంతి మహోత్సవాన్ని టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 21వ తేదీన కాకర్లలో ఘనంగా నిర్వహించనున్నారు. ధర్మప్రచారంలో భాగంగా ప్రముఖ వాగ్గేయకారుల జయంతి, వర్ధంతి మహోత్సవాలను టిటిడి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా కాకర్లలోని టిటిడి ధ్యాన మందిరం వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సాయంత్రం 4.00 నుండి 5.00 గంటల వరకు మంగళధ్వనితో శ్రీ త్యాగరాజస్వామివారి జయంతి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అనంతరం సాయంత్రం 5.00 నుండి 6.00 గంటల వరకు ప్రముఖ సంగీత విద్వాంసులు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల అధ్యాపకులతో శ్రీత్యాగరాజస్వామివారి పంచరత్న కీర్తనలు ఆలపించనున్నారు. సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు శ్రీవారి కల్యాణం వైభవంగా జరగనుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.