SNAPANAM PERFORMED ON DAY ONE OF SSV_ వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి సాక్షాత్కార వైభవోత్సవాలు ప్రారంభం

Srinivasa Mangapuram, 28 Snapana Tirumanjanam was performed in a ceremonial manner in Sri Kalyana Venkateswara Swamy temple in Srinivasa Mangapuram on the first day of Srivari Sakshatkara Vaibhavotsavams on Wednesday.

The three-day fete commenced in this famous shrine followed by Tiruchi Vahanam in the evening.

Temple DyEO Sri Venkataiah, AEO Sri Dhananjaya were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి సాక్షాత్కార వైభవోత్సవాలు ప్రారంభం

తిరుపతి, 2017 జూన్‌ 28: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు జరుగనున్నాయి. మొదటిరోజు ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 9.00 నుండి 10.00 గంటల వరకు కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు.

అనంతరం సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌సేవ జరుగనుంది. రాత్రి 7.00 నుండి 8.00 గంటల వరకు తిరుచ్చి వాహనంపై స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో అష్టోత్తర శతకళశాభిషేకం, ఆర్జిత కల్యాణోత్సవం సేవలను రద్దు చేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ వేంకటయ్య, ఎఈవో శ్రీ ధనంజయ, సూపరింటెండెంట్‌ శ్రీ చంద్రశేఖర్‌బాబు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీఅనిల్‌కుమార్‌, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.