SIMAHA VAHANA SEVA HELD _ సింహ వాహనంపై ఆదిలక్ష్మి అలంకారంలో లోకమాత

TIRUPATI, 22 NOVEMBER 2022: On the third day evening of the ongoing annual Karthika Brahmotsavams at Tiruchanoor, Goddess Padmavathi Devi as Adilakshmi blessed Her devotees on Simha Vahanam on Tuesday evening.

Both the seers of Tirumala, Chandragiri Legislator and TTD Ex-officio board member Dr C Bhaskar Reddy, JEO Sri Veerabrahmam, DyEO Sri Lokanatham and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
సింహ వాహనంపై ఆదిలక్ష్మి అలంకారంలో లోకమాత
 
తిరుపతి, 2022 నవంబర్ 22: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన మంగళవారం రాత్రి సింహ వాహనంపై ఆదిలక్ష్మి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులకు కటాక్షించారు. అశ్వాలు, వృషభాలు, గజాలు  ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటల నుండి వాహనసేవ సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు .
 
సింహం పరాక్రమానికి, శీఘ్రగమనానికి, వహనశక్తికి ప్రతీక. అమ్మవారికి సింహం వాహనంగా సమకూరిన వేళ దుష్టశిక్షణ, శిష్టరక్షణ అవలీలగా చేస్తారు. శ్రీ పద్మావతి అమ్మవారు ఐశ్వర్యం, వీర్యం, యశస్సు, శ్రీ (ప్రభ), జ్ఞానం, వైరాగ్యం అనే ఆరు గుణాలను భక్తులకు ప్రసాదిస్తారు.
 
వాహనసేవల్లో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్‌, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యంగార్‌, చంద్రగిరి ఎమ్మెల్యే, టిటిడి బోర్డు సభ్యులు శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు, జెఈవో శ్రీ వీరబ్రహ్మం దంపతులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఆగమ సలహాదారులు శ్రీ శ్రీనివాసచార్యులు, విఎస్‌వోలు శ్రీ మనోహర్,  శ్రీ బాలి రెడ్డి,  ఏఈవో  శ్రీ ప్రభాకర్ రెడ్డి , ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, సూప‌రింటెండెంట్ శ్రీ మధు, ఆర్జితం ఇన్స్పెక్టర్ శ్రీ దాము పాల్గొన్నారు.