SPEAKER OF LOK SABHA IN TIRUMALA _ తిరుమలకు చేరుకున్న లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా

Tirumala, 15 Aug. 21: Speaker of Lok Sabha Sri Om Birla along with his family members arrived at the Sri Krishna Rest House and was accorded a warm welcome by TTD Chairman Sri YV Subba Reddy, TTD EO Dr KS Jawahar Reddy, Addl EO Sri AV Dharma Reddy, at Tirumala on Monday evening.

 

MPs Sri Vijayasai Reddy Sri Mithun Reddy, Sri M Gurumurthy, Reception Officials Sri Lokanadham, Sri Ramakrishna and others were present.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

తిరుమలకు చేరుకున్న లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా

తిరుమల, 16 ఆగస్టు 2021: శ్రీవారి దర్శనార్థం విచ్చేసిన లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా సోమవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు.

తిరుమలలోని శ్రీకృష్ణ విశ్రాంతి గృహానికి చేరుకున్న స్పీకర్ కు టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి, అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు.

స్పీకర్ శ్రీ ఓం బిర్లా కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.

స్వాగతం పలికినవారిలో ఎంపిలు శ్రీ విజయసాయిరెడ్డి, శ్రీ మిధున్ రెడ్డి, శ్రీ గురుమూర్తి, కలెక్టర్ శ్రీ హరినారాయణన్, అదనపు ఎస్పీ శ్రీ మునిరామయ్య తదితరులు ఉన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.