SRINIVASA KALYANAMS IN PRAKASAM_ ఆగస్టు 4 నుంచి 9వ తేదీ వరకు ప్రకాశం జిల్లాలో శ్రీనివాస కల్యాణాలు

Tirupati, 3 August 2018: Srinivasa Kalyanams in Prakasam district will be observed from August 4 to 9 under the aegis of Srinivasa Kalyanam Project.

On August 4 in Dornala, on August 5 Pullala Cheruvu, August 6 in Tripurantakam, August 7 in Markapuram, August 8 in Arthaveedu and on August 9 in Giddaluru these Kalyanams will be performed.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆగస్టు 4 నుంచి 9వ తేదీ వరకు ప్రకాశం జిల్లాలో శ్రీనివాస కల్యాణాలు

తిరుపతి, 2018 ఆగస్టు 03: టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్ట్‌ ఆధ్వర్యంలో ఆగస్టు 4 నుంచి 9వ తేదీ వరకు ప్రకాశం జిల్లాలోని 6 ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు జరుగనున్నాయి. అన్నిచోట్లా సాయంత్రం 6 గంటలకు కల్యాణాలు ప్రారంభంకానున్నాయి.

– ఆగస్టు 4వ తేదీన డోర్నాల మండలం, తుమ్మలబైలు గ్రామంలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది.

– ఆగస్టు 5న పుల్లలచెరువు మండలం, గంగవరం గ్రామంలో స్వామివారి కల్యాణం నిర్వహించనున్నారు.

– ఆగస్టు 6న త్రిపురాంతకం మండలం, రామసముద్రం గ్రామంలోని శ్రీ రాములవారి ఆలయ ప్రాంగణంలో శ్రీవారి కల్యాణం జరుగనుంది.

– ఆగస్టు 7న మార్కాపురం మండలం, కోట్టాలపల్లి గ్రామంలోని యస్‌.సి కాలనీలో ఉన్న శ్రీ రాములవారి ఆలయ ప్రాంగణంలో శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తారు.

– ఆగస్టు 8న అర్థవీడు మండలం, బీమరాయునిచెరువు గ్రామంలో శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు.

– ఆగస్టు 9న గిద్ధలూరు మండలం, జయరాంతండలో స్వామివారి కల్యాణం జరుగనుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.