SUNDERARAJA SWAMY UTSAVAMS_ జూలై 3 నుండి 5వ తేదీ వరకు శ్రీ సుందరరాజస్వామివారి వార్షిక అవతార మహోత్సవాలు

Tirupati, 28 June 2018: The annual Avatara Mahotsavams of Sri Sundera Raja Swamy, a sub-temple in Tiruchanoor, will be observed from July 3 to 5.

There will be special rituals in connection with this auspicious fete. Every day, Sahsra Namarchana to Sri Sundera Raja Swamy will be rendered between 10.30am and 12 noon followed by Kalyanotsavam to Ammavaru.

Every day afternoon between 2pm and 3.30pm, Abhishekam is performed to Sri Sundera Raja Swamy in Sri Krishna Mukha Mandapam followed by Unjal Seva between 5.15pm and 6.15pm.

On first day evening the lord takes ride on Pedda Sesha, Second day on Hanumantha and final day on Garuda vahanams.

In view of this festival, Sahasra Deepalankara Seva has been cancelled on these three days.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూలై 3 నుండి 5వ తేదీ వరకు శ్రీ సుందరరాజస్వామివారి వార్షిక అవతార మహోత్సవాలు

తిరుపతి, 2018 జూన్‌ 28: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజ స్వామివారి అవతార మహోత్సవాలు జూలై 3 నుండి 5వ తేదీ వరకు మూడు రోజుల పాటు వైభవంగా జరుగనున్నాయి.

ఈ సందర్భంగా ఆలయంలో ప్రతిరోజూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ప్రతి రోజు ఉదయం శ్రీ సుందరరాజస్వామివారికి సహస్రనామార్చన, ఉదయం 10.30 నుండి 12.00 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారికి కల్యాణోత్సవం నిర్వహిస్తారు.

జూలై 3, 4, 5వ తేదీలలో మధ్యాహ్నం 2.00 నుండి 3.30 గంటల వరకు శ్రీ కృష్ణస్వామి ముఖమండపములో శ్రీ సుందరరాజ స్వామివారికి వైభవంగా అభిషేకం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంలతో విశేషంగా అభిషేకం చేస్తారు. అనంతరం సాయంత్రం 5.30 నుండి 6.15 గంటల వరకు శ్రీ కృష్ణస్వామివారి ముఖమండపంలో ఊంజల్‌ సేవ జరుగుతుంది.

జూలై 3వ తేదీ మంగళవారం రాత్రి 7.00 గంటల నుండి 8.30 గంటల వరకు శ్రీసుందరరాజస్వామివారు పెద్దశేష వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.

జూలై 4వ తేదీ బుధవారం రాత్రి 7.00 గంటల నుండి 8.30 గంటల వరకు శ్రీసుందరరాజస్వామివారు హనుమంత వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు కనువిందు చేయనున్నారు.

జూలై 5వ తేదీ గురువారం రాత్రి 7.00 గంటల నుండి 8.30 గంటల వరకు స్వామివారు గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు. ఈ ఉత్సవాల సందర్భంగా జూలై 3 నుండి 5వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సహస్రదీపాలంకరణసేవను రద్దు చేశారు.

సంక్షిప్త సమాచారం :

శ్రీ సుందరరాజస్వామివారి అవతార మహోత్సవాల పురాణ నేపథ్యాన్ని పరిశీలిస్తే చాలా సంవత్సరాల క్రితం ముష్కరులు మధురైలో ఉన్న అళగిరి పెరుమాళ్‌ కోయిల్‌ను కూల్చేందుకు ప్రయత్నించారట. ఆ సమయంలో అక్కడున్న అర్చకస్వాములు శ్రీ సుందరరాజస్వామివారి ఉత్సవమూర్తులను తిరుచానూరుకు తీసుకొచ్చారని ప్రచారంలో ఉంది. దానికి తగ్గట్టుగానే స్వామివారి విగ్రహాలు(ఉత్సవర్లు) పురాతనంగా కనిపిస్తున్నాయి. మహంతుల కాలంలో అనగా 1902వ సంవత్సరంలో మూలమూర్తులను తయారుచేసి ప్రతిష్ఠించారని చరిత్ర ద్వారా తెలు స్తోంది. ఆ తరువాత సుందరరాజస్వామివారికి అనేక ఉత్సవాలు జరిగాయి. స్వామివారిని జ్యేష్ఠమాసంలో శతభిష నక్షత్రం నాడు తిరుచానూరుకు తీసుకొచ్చినందున ఆ రోజు నుండి ఉత్తరాభాద్ర నక్షత్రం నాటికి ముగిసేలా అవతార మహోత్సవాలను టిటిడి వైభవంగా నిర్వహిస్తోంది.

———————————————————————

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.