VENGAMAMBA JAYANTHI POSTERS RELEASED_ మాతృ శ్రీ తరిగొండ వెంగమాంబ 202వ వర్ధంతి ఉత్సవాల పోస్టర్లు ఆవిష్కరణ : తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్‌ కుమార్‌

Tirupati, 5 Aug. 19: The posters of 202nd Birth Anniversary Celebrations of Matrusri Tarigonda Vengamamba were released by Tirupati JEO Sri P Basant Kumar on Monday in his chambers in the TTD Administrative building.

The JEO said, this fete will be observed at Tarigonds, Tirupati and Tirumala on August 8 and 9 in a big way. On August 8, the celestial Kalyanam of Sri Lakshmi Narasimha will be observed in the Lakshmi Narasimha Swamy temple at Tarigonda. While on August 9 there will be Pushpanjali to Vengamamba statue at MR Palle in Tirupati and also at Vengamamba Samadhi in Tirumala.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మాతృ శ్రీ తరిగొండ వెంగమాంబ 202వ వర్ధంతి ఉత్సవాల పోస్టర్లు ఆవిష్కరణ : తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్‌ కుమార్‌

తిరుపతి, 2019 ఆగస్టు 05: మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 202వ వర్ధంతి ఉత్సవాల పోస్టర్లను సోమవారం టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్‌ కుమార్‌ అవిష్కరించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనభవనంలోని జెఈవో కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా తిరుపతి జెఈవో మాట్లాడుతూ ఆగస్టు 8, 9వ తేదీలలో తిరుమల, తిరుపతి, తరిగొండలో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఇందులో భాగంగా వెంగమాంబ జన్మస్థలమైన తరిగొండలో కొలువైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో ఆగస్టు 8వ తేదీ సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదేవిధంగా ఆగస్టు 9వ తేదీ సాయంత్రం 6.00 గంటల నుండి రాత్రి 8.00 గంటల వరకు శ్రీ లక్ష్మీనృసింహస్వామివారికి కల్యాణోత్సవం, రాత్రి 8.00 నుండి 9.30 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఆగస్టు 8వ తేదీన ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు తరిగొండ వెంగమాంబ సాహిత్యంపై సదస్సు నిర్వహించనున్నారు. అదేరోజు సాయంత్రం 6.00 నుండి 8.00 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆగస్టు 9వ తేదీ ఉదయం 10.00 నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు, సాయంత్రం 6.00 గంటల నుండి రాత్రి 8.00 గంటల వరకు ప్రముఖ కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆగస్టు 9వ తేదీ ఉదయం 11.30 గంటలకు ఎం.ఆర్‌.పల్లి సర్కిల్‌ వద్ద ఉన్న తరిగొండ వెంగమాంబ విగ్రహానికి టిటిడి అధికారులు పుష్పాంజలి ఘటిస్తారు.

ఆగస్టు 9వ తేదీ ఉదయం 9.00 గంటలకు తిరుమలలోని తరిగొండ వెంగమాంబ బృందావనంలో టిటిడి ఉన్నతాధి కారులు పుష్పాంజలి సమర్పించనున్నారు.

ఈ కార్యక్రమంలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు సంచాలకులు ఆచార్య బి.విశ్వనాథ్‌, సూపరింటెండెంట్‌ శ్రీ ఎన్‌.వెంకటరమణ, శ్రీ నరసింహులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.