తిరుప్పావై ఉపన్యాసాల నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం

తిరుప్పావై ఉపన్యాసాల నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం

అక్టోబరు 03, తిరుపతి, 2017 : పవిత్రమైన ధనుర్మాసంలో డిసెంబరు 16 నుంచి 2018, జనవరి 14వ తేదీ వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో తిరుప్పావై ఉపన్యాసాలు చేసేందుకు సమర్థులైన శ్రీవైష్ణవ సిద్ధాంతం తెలిసిన పండితుల నుంచి దరఖాస్తులు, నిష్ణాతులైన పండితుల నుంచి అంగీకార పత్రాలను టిటిడి ఆహ్వానిస్తోంది.

టిటిడి ఆళ్వార్‌ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతి ఏటా ధనుర్మాసంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో తిరుప్పావై ఉపన్యాసాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అర్హులైనవారు ఈ ఏడాది అక్టోబరు 15వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ”ప్రత్యేకాధికారి, ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు, టిటిడి, తిరుపతి” అనే చిరునామాకు దరఖాస్తులు, అంగీకార పత్రాలు పంపాల్సి ఉంటుంది. అంగీకార పత్రాలు ఇచ్చే పండితుల పట్టికతోపాటు, షరతులు, దరఖాస్తులను షషష.్‌ఱతీబఎaశ్రీa.శీతీస్త్ర మరియు షషష.్‌ఱతీబజూa్‌ఱ.శీతీస్త్ర వెబ్‌సైట్ల నుంచి పొందొచ్చు.

ఇతర వివరాలకు టిటిడి ఆళ్వార్‌ దివ్య ప్రబంధ ప్రాజెక్టు కార్యాలయాన్ని 0877-2264447, 0877-2264083, సెల్‌ : 9908577715 నంబర్లకు సంప్రదించగలరు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.