TTD’s TOKEN OF APPRECIATION TO DONORS AND SRIVARI SEVAKULU_ దాతలకు, శ్రీవారి సేవకులకు ఉగాది శుభాకాంక్షల పత్రికలు : జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

\Tirumala, 13 March 2018: As a token of appreciation to the donations made by donors to TTD run trusts and schemes and also to the voluntary services of srivari sevakulu, TTD is sending Ugadi greeting cards, said Tirumala JEO Sri KS Sreenivasa Raju.

Speaking to media in Tirumala, the JEO said, 56000 cards to donors and eight thousand cards to srivari seva team leaders in two Telugu states will be dispatched before Saturday, he added.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

దాతలకు, శ్రీవారి సేవకులకు ఉగాది శుభాకాంక్షల పత్రికలు : జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

మార్చి 13, తిరుమల, 2018: టిటిడికి విరాళాలు అందించిన దాతలకు, భక్తులకు స్వచ్ఛందంగా సేవలందిస్తున్న శ్రీవారి సేవకులకు శ్రీ విళంబినామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని శ్రీవారి ఆశీస్సులతో కూడిన శుభాకాంక్షల పత్రికలు పంపుతున్నట్టు తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనం వద్ద మంగళవారం సాయంత్రం జెఈవో మీడియాతో మాట్లాడుతూ టిటిడిలోని పలు ట్రస్టులు, స్కీములకు విరాళాలు అందిస్తున్న దాతలు 56 వేల మంది ఉన్నారని తెలిపారు. దాతలకు 2012వ సంవత్సరం నుండి ఉగాది శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో శ్రీవారి సేవ బృంద నాయకులు 8 వేల మంది వరకు ఉన్నట్టు చెప్పారు. మొదటిసారిగా శ్రీవారి సేవకులకు స్వామివారి ఆశీస్సులతో ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. టిటిడికి సహకరిస్తున్న దాతలకు, శ్రీవారి సేవకులకు అభినందనపూర్వకంగా శుభాకాంక్షల పత్రికలు పంపుతున్నట్టు తెలిపారు. ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలైందని, శనివారం నాటికి చేరేలా ఏర్పాట్లు చేపట్టామని జెఈవో వివరించారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.