శ్రీ విళంబినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

శ్రీ విళంబినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

మార్చి 16, తిరుమల 2018: శ్రీ విలంబినామ ఉగాది సంవత్సరాన్ని పురస్కరంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ కలిసి భక్తులకు, ఉద్యోగులకు, ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

నూతన తెలుగు సంవత్సరాదిని ఉత్సాహంగా జరుపుకోవాలని, శ్రీ పద్మావతి వేంకటేశ్వరుల ఆశీస్సులతో భక్తులందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.