MATSYA JAYANTI IN VEDANARAYANA SWAMY TEMPLE ON MARCH 20_ మార్చి 20న శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో మత్స్య జయంతి

Tirupati, 15 March 2018: Matsya Jayanthi will be observed in the famous temple of Sri Vedanarayana Swamy at Nagalapuram on March 20.

On the occasion, there will be thiruveedhi utsavam, snapana tirumanjanam and in the Garuda Seva will be observed.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

మార్చి 20న శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో మత్స్య జయంతి

మార్చి 15, తిరుపతి, 2018: నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో మార్చి 20వ తేదీన మత్స్య జయంతి ఘనంగా జరుగనుంది.

శ్రీమహావిష్ణువు వేదాలను రక్షించేందుకు లోకకల్యాణం కోసం మత్స్యావతారంలో స్వయంభువుగా వెలిసిన రోజును మత్స్య జయంతిగా పిలుస్తారు. ఈ రోజున మత్స్యావతార వేదనారాయణస్వామివారిని దర్శించుకున్న భక్తులకు మనశ్శాంతి, నవగ్రహశాంతి, కల్యాణసౌభాగ్యం, భోగభాగ్యాలు కలుగుతాయని ప్రతీతి.

ఈ సందర్భంగా ఉదయం 5 గంటలకు సుప్రభాతంతో స్వామివారి మేల్కొల్పి తోమాల, అర్చన అనంతరం 6.30 నుండి 8.30 గంటల వరకు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. ఉదయం 9 నుండి 11.30 గంటల వరకు శాంతిహోమం, స్నపన తిరుమంజనం చేపడతారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 9.30 గంటల వరకు గరుడ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.